తెలంగాణ

telangana

ETV Bharat / city

AP CORONA: ఏపీలో కొత్తగా 3,175 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 3,175 కరోనా కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 94,595 పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.

By

Published : Jul 4, 2021, 5:40 PM IST

AP CORONA CASES
AP CORONA CASES

గడిచిన 24 గంటల్లో ఏపీలో 94,595 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... 3,175 కరోనా కేసులు (corona cases) బయటపడ్డాయి. వీటితో పాటు 29 మరణాలు నమోదయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. తాజాగా ఏపీలో కరోనా నుంచి మరో 3,692 మంది కోలుకోగా... ప్రస్తుతం 35, 25 కరోనా యాక్టివ్ కేసులు (corona active cases) ఉన్నాయి.

కొవిడ్ కారణంగా చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 662 మందికి కరోనా సోకింది. చిత్తూరు జిల్లాలో 473, పశ్చిమగోదావరి జిల్లాలో 398, ప్రకాశం జిల్లాలో 322 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.

AP CORONA CASES

ఇదీ చూడండి:లక్ష్యానికి చేరువలో.. 6నెలల వ్యవధిలో కోటి 16 లక్షల టీకాలు

ABOUT THE AUTHOR

...view details