తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ఇవాళ 42 కరోనా పాజిటివ్‌ కేసులు

By

Published : May 17, 2020, 9:03 PM IST

Updated : May 17, 2020, 9:40 PM IST

telangana corona cases today
telangana corona cases today

21:01 May 17

రాష్ట్రంలో ఇవాళ 42 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా మరో 42 మందికి కరోనా వైరస్‌ సోకింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 37 మందిలో పాజిటివ్‌ నిర్ధరణ కాగా, రంగారెడ్డిలో ఇద్దరికి కరోనా వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన ముగ్గురు వలస కూలీల్లో కూడా వైరస్‌ను గుర్తించారు. మొత్తంగా వలసజీవుల్లో ఇప్పటి వరకూ పాజిటివ్‌ వచ్చినవారి సంఖ్య 55 కు చేరింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 1,551కు పెరిగింది.

ఇవాళ 21 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు 992 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. ఆస్పత్రుల్లో 525 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 34 మంది మృతిచెందారు.  

Last Updated : May 17, 2020, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details