కంటోన్మెంట్ ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకొస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రిని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్నతో కలిసి ఇవాళ సందర్శించారు. ఆస్పత్రిలోని సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది వివరాలపై మంత్రి ఆరా తీశారు. దవాఖానాను రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి తీసుకొని మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కంటోన్మెంట్ సీఈవో చంద్రశేఖర్ కోరారు. అధికారుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు.
కంటోన్మెంట్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ కంటోన్మెంట్ ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఆస్పత్రిలోని సదుపాయాలపై ఆరా తీశారు. కంటోన్మెంట్ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి తీసుకొని మెరుగైన సేవలు అందించాలని కంటోన్మెంట్ సీఈవో మంత్రికి విజ్ఞప్తి చేశారు.
కంటోన్మెంట్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల