తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2020, 6:35 PM IST

ETV Bharat / city

రెడ్​క్రాస్​ సహకారంతో ఫలక్​నుమా పోలీసుల రక్తదాన శిబిరం

హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్​నుమాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీపీ అంజనీ కుమార్​ ప్రారంభించారు. తలసేమియా వ్యాదిగ్రస్థుల కోసం రెడ్​క్రాస్​ సహకారంతో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

hyderabad cp anjani kumar inaugurate blood donation camp in falaknuma
రెడ్​క్రాస్​ సహకారంతో ఫలక్​నుమా పోలీసుల రక్తదాన శిబిరం

హైదరాబాద్ పాతబస్తీ ఫలక్​నుమా డివిజన్ పోలీస్​ల ఆధ్వర్యంలో... రెడ్​క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్​ ముఖ్యఅతిథిగా హాజరై... ప్రారంభించారు. తలసేమియా వ్యాధి గ్రస్థుల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 80మందికి రక్తదానం చేసినట్టు వెల్లడించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానికులు... 150 మంది రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రక్త దానమే కాకుండా ప్లాస్మా దానంలోనూ పోలీస్ విభాగం ముందున్నట్టు సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం డీసీపీ, అదనపు డీసీపీ, ఫలక్​నుమా ఏసీపీ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details