తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యార్థిని కంట్లో పెన్సిల్​తో దాడి

హైదరాబాద్ రాజేంద్రనగర్​లోని కృషి ఉన్నత పాఠశాలలో పెన్సిల్​తో విద్యార్థిని కంట్లో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

By

Published : Mar 28, 2019, 2:37 PM IST

పాఠశాలముందు ఆందోళన

పాఠశాలముందు తల్లిదండ్రుల ఆందోళన
హైదరాబాద్​ రాజేంద్రనగర్​లోని కృషి ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థినిపై పెన్సిల్​తో దాడి చేశారు. తల్లిదండ్రులఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఏం జరిగింది...?

నాలుగో తరగతి చదువుతున్న సౌజన్య మంగళవారం రోజు భోజనం చేసి పాఠశాల ఆవరణలో కూర్చొని ఉంది. అంతలోనేతన కళ్లకు బలంగా గాయమైనట్లు అనిపించి ఏడుస్తుండగా... తోటి విద్యార్థినులు టీచర్​కు చెప్పారు. టీచర్​ ఐస్​ను పాప కళ్లపై రాసింది. ఇంతలో తల్లిదండ్రులు వచ్చి సౌజన్యను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

డాక్టర్లు బాధితురాలి కంటికి శస్త్రచికిత్స చేశారు. ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక తల్లిదండ్రులు స్కూల్​కు వచ్చి ఉపాధ్యాయులను నిలదీశారు. సీసీటీవీ ఫుటేజ్​లు చూపించమంటే నిరాకరిస్తున్నారని సౌజన్య తల్లి చెబుతున్నారు.

ఇదే విషయం ప్రిన్సిపాల్​ను అడగగా... ఆ సమయంలో తాను పాఠశాలలో లేనని, రెండు రోజులుగా స్కూల్​లో లేనని అంటున్నారు. పాపపై దాడి చేసింది ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండిఃటర్కీలో షూటింగ్​... హీరో విశాల్​కు గాయాలు

ABOUT THE AUTHOR

...view details