సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. హైదరాబాద్ రాజ్భవన్లో పటేల్కు శ్రద్ధాంజలి అర్పించారు. ఉక్కు మనిషి దృఢసంకల్పం, కార్యదక్షత, త్యాగం, సేవానిరతి ఆయన విలక్షణమని దత్తాత్రేయ అన్నారు. 562 సంస్థానాలను విలీనం చేసి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏకం చేసిన మహానుభావుడు పటేల్ అని కొనియాడారు.
రాజ్భవన్లో పటేల్, ఇందిరాగాంధీకి బండారు దత్తాత్రేయ నివాళులు
ఏక్తా దివస్ సందర్భంగా హైదరాబాద్ రాజ్భవన్లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్కు హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శ్రద్ధాంజలి అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన నివాళులర్పించారు.
రాజ్భవన్లో పటేల్, ఇందిరాగాంధీకి బండారు దత్తాత్రేయ నివాళులు
కులమతాలకు అతీతంగా దేశ సమైక్యతకు, సమగ్రతకు పాటుపడటమే పటేల్కు మనమిచ్చే నిజమైన నివాళి అని.. అతని కృషికి గుర్తుగానే ఏక్తా దివస్ను జరుపుకుంటున్నామని దత్తాత్రేయ వివరించారు. అదే విధంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 36వ వర్ధంతిని పురస్కరించుకుని దత్తాత్రేయ ఆమెకు నివాళులు అర్పించారు. దేశ అభవృద్ధి కోసం ఆమె చేసిన కృషి ఎప్పుడూ ప్రజల్లో గుర్తుండిపోతుందని బండారు కొనియాడారు.