1. బ్యాంకు ఉద్యోగిపై.. దానం దౌర్జన్యం!
బ్యాంకు ఉద్యోగిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం వ్యవహరించిన తీరు చర్చనీయాశమైంది. బ్యాంకులో లోన్ తీసుకొని తిరిగి రుణం చెల్లించని ఓ మహిళకు చెందిన భూమిని వేలం వేసి.. ఖైరతాబాద్లోని ఆ స్థలం చుట్టూ కంచె వేసేందుకు వచ్చిన బ్యాంకు ఉద్యోగుల పట్ల దానం, ఆయన అనుచరులు బెదిరిస్తూ దుర్భాషలాడుతూ నెట్టివేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. హైదరాబాద్ మేయర్కు కరోనా పాజిటివ్
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్కు కరోనా పాజిటివ్ నిర్ధరణయింది. శనివారం మేయర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ మేయర్ బొంతు రామ్మోహన్కు కరోనా పాజిటివ్ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'కుతంత్రాలను సైనికులు ఛేదిస్తారు'
కార్గిల్ అమరవీరుల స్ఫూర్తితో చైనా కుట్ర కుతంత్రాలను భారత సైనికులు ఛేదిస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. కార్గిల్ విజయాన్ని ఎప్పటికీ గుర్తించుకుంటారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. వరదలో కారు- కాపాడిన జనం
కర్ణాటక కలబురిగి జిల్లా బడదల గ్రామం వద్ద కాలువలో కొట్టుకుపోతున్న ఓ కారులోని ఐదుగురిని రక్షించారు స్థానికులు. ఏకంగా కారుకు తాడు కట్టి ప్రాణాలకు తెగించి కాపాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. వరదలో పురిటి నొప్పులు
బిహార్లో సహాయక దళాల పడవలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఇంటి నిండా వరద నీరు చేరి పురిటి నొప్పులతో తల్లడిల్లిన గర్భిణిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రమయ్యాయి. పడవలోనే ప్రసవించిన ఆ తల్లి, బిడ్డలు ప్రస్తుతం ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.