'రాజీపడే ప్రసక్తే లేదు'
కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు. శనివారం నారాయణపేట జిల్లాలో మంత్రి పర్యటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గంగా జమునా తెహజీబ్కు ప్రతీక
తెలంగాణ రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
50వేలే భర్తీ చేస్తారా?
ముఖ్యమంత్రి కేసీఆర్కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బహిరంగ లేఖను రాశారు. సుమారు 2 లక్షల పోస్టులుంటే 50 వేలే భర్తీ చేస్తారా అని ప్రశ్నించారు. కరోనా వేళ స్టాఫ్ నర్సులను దేవుళ్లని పొగిడారు.. ప్రస్తుతం నర్సులు ప్రగతిభవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని లేఖలో వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'కేసీఆర్ను జైలుకు పంపుతాం'
ముఖ్యమంత్రి కేసీఆర్ను జైలుకు పంపుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్లో ఆయన పర్యటించారు. భాజపా త్యాగాల పార్టీ అని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రోదసిలోకి తెలుగుతేజం
విశ్వవినువీధిలో తెలుగు కీర్తిపతాకం ఎగరబోతోంది. రోదసిపై తొలిసారి ఒక తెలుగు మహిళ అడుగుపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించనున్నారు. కల్పనాచావ్లా, సునీత విలియమ్స్ తర్వాత రోదసీయానం చేయనున్న భారత సంతతి మహిళగా శిరీష చరిత్ర పుటలకెక్కనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.