తెలంగాణ

telangana

ETV Bharat / city

Dogs In Covid Ward: కొవిడ్​ ఐసీయూ వార్డులో కుక్కల సంచారం

Dogs in covid ICU ward : ఏపీలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లోని కొవిడ్‌ ఐసీయూ వార్డులో కుక్కల సంచారం కలకలం రేపింది. రోగుల కోసం ఏర్పాటు చేసిన మంచాలపైనే శునకాలు నిద్రిస్తున్నాయంటే.. పర్యవేక్షణ లోపం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

By

Published : Feb 18, 2022, 11:00 AM IST

dogs in covid ward
dogs in covid ward

Dogs in covid ICU ward : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లోని కొవిడ్‌ ఐసీయూ వార్డుల్లో కుక్కలు తిరుగుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడం వల్ల.. రోగుల కోసం ఏర్పాటు చేసిన మంచాలపైనే అవి నిద్రిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 39 మంది కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఆసుపత్రిలో పరిస్థితిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వద్ద ప్రస్తావించగా.. ‘రోగులు భోజనాలు చేసిన తరువాత ఎక్కడికక్కడ పారబోస్తుండడం వల్ల కుక్కలు వస్తున్నాయి. గతంలో సమస్య ఎదురైతే పరిష్కరించాం. మరోసారి దృష్టి సారిస్తాం’ అని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details