రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన అన్నింటిని పక్కన పెట్టి కరోనా నివారణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.
హైదరాబాద్లో పరిస్థితిపైనా ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితుడు తన చివరి క్షణాల్లో... ఆక్సిజన్ దొరకడం లేదు.. ఊపరి ఆడక తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయాన్ని వీడియో రికార్డు చేసి పంపుతున్న దయనీయ పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సింది పోయి... మరణించే వాళ్లు రికార్టు చేసి వీడియో పంపడం న్యాయమా.. అని ఆరోగ్య శాఖ మంత్రి మానవత్వం లేకుండా మాట్లాడడం తగునా అని భట్టి ప్రశ్నించారు.