ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వీలుగానే ఆయనను ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో పదవి నుంచి తొలగించినట్టు స్పష్టమవుతోందని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) పేర్కొంది. కృష్ణకిశోర్ను ఏపీఈడీబీ సీఈవో పదవి నుంచి ప్రభుత్వ ఎక్స్అఫీషియో కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులివ్వడానికి సంస్థ బోర్డు నుంచి ఎలాంటి సూచన, నిర్ణయం లేవంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా డిప్యుటేషన్పై తీసుకోవడానికి ఎలాంటి ఆధారాలూ లేవని పేర్కొంది. ఆయనపై చర్యలు చేపట్టేందుకు వీలుగా దురుద్దేశంతోనే తీసుకుందని...ఇలా తీసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా పరిశీలించాలన్న ట్రైబ్యునల్... విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. కృష్ణ కిశోర్ సస్పెన్షన్పై ఇచ్చిన మధ్యంతర స్టేను జనవరి నెలాఖరు వరకూ పొడిగించింది. రావాల్సిన జీతాలను 2 వారాల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నిర్ణయం దారుణం...