హైదరాబాద్ మంగళ్హాట్లో భాజపా కార్పొరేటర్ శశికళ పర్యటించారు. సిట్టింగ్ తెరాస కార్పొరేటర్ను ఓడించి తనను గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్ర సమయంలో రోడ్లు, తాగునీటి సమస్యలను ప్రజలు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. వారి సమస్యలను తప్పకుండా తీరుస్తానని ప్రజలకు శశికళ మరోసారి హామీ ఇచ్చారు.
తాగునీరు, రోడ్ల మరమ్మతుపై ప్రత్యేక శ్రద్ధ: శశికళ
గ్రేటర్ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి గెలిచిన అభ్యర్థి శశికళ మంగళ్హాట్లో పర్యటించారు. పాదయాత్ర సమయంలో తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు మరోసారి హామీ ఇచ్చారు.
మంగళ్హాట్లో భాజపా కార్పొరేటర్ శశికళ పర్యటన