తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ ఘటన బాధ్యులపై చర్యలు: ఏపీ హోం మంత్రి

రాష్ట్రంలో మద్య నిషేధానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. దశలవారీగా మద్యం నిషేధాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. విశాఖ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. ప్రమాదానికి కారుకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

By

Published : May 10, 2020, 4:34 PM IST

ap home-minister-suchari-says-govt-will-take-actions-on-lg-polymers
విశాఖ ఘటన బాధ్యులపై చర్యలు: ఏపీ హోం మంత్రి

దశలవారీగా మద్యం నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్​ హోంమంత్రి సుచరిత తెలిపారు. గుంటూరులో మాట్లాడిన ఆమె.. మద్యం దుకాణాల తగ్గింపు, ధరలు పెంపుతో మద్య ప్రవాహాన్ని అదుపు చేస్తున్నామన్నారు. కరోనా నివారణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.

విశాఖ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని హోంమంత్రి తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. కారకులైన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అవసరమైతే కంపెనీని తరలించడానికి ప్రభుత్వం యోచిస్తోందన్నారు.

దశలవారీగా వలస కూలీలను తరలిస్తున్నామని హోంమంత్రి పేర్కొన్నారు. స్పందన వెబ్​సైట్​లో నమోదు చేసుకున్న వారిని వెంటనే తరలిస్తున్నామన్న సుచరిత.. అందరినీ ఒకేసారి పంపించడం సాధ్యం కాదని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇవీ చూడండి: అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయిస్తాం : హోం మంత్రి

ABOUT THE AUTHOR

...view details