తెలంగాణ

telangana

By

Published : Jul 24, 2020, 4:46 PM IST

ETV Bharat / city

'కించపరిచేలా పోస్టులు పెట్టినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు'

ఏపీలో న్యాయవ్యవస్థను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పెట్టిన వ్యవహారంపై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంలో పూర్తి ప్రమాణపత్రం దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది.

breaking hc case judges
'కించపరిచేలా పోస్టులు పెట్టినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు'

న్యాయవ్యవస్థను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన అంశంపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇప్పటికే విచారణ పూర్తయిందని...ఛార్జిషీట్​ను సిద్ధం చేస్తున్నట్లు సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ అంశంలో పూర్తి ప్రమాణపత్రం దాఖలు చేయాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details