తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2021, 10:38 PM IST

ETV Bharat / city

జస్టిస్‌ జేకే మహేశ్వరికి పూలబాటవేసి అమరావతి రైతుల వీడ్కోలు

ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరికి అమరావతి రైతులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన వెళ్లే మార్గంలో పూలబాట ఏర్పాటు చేశారు. దారిపొడువునా పూలు చల్లి కృతజ్ఞతాపూర్వకంగా వీడ్కోలు పలికారు.

జస్టిస్‌ జేకే మహేశ్వరికి అమరావతి రైతుల వీడ్కోలు
జస్టిస్‌ జేకే మహేశ్వరికి అమరావతి రైతుల వీడ్కోలు

ఏపీ ఉన్నత న్యాయస్థానం నుంచి నుంచి సిక్కిం హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న సీజే జస్టిస్ జేకే మహేశ్వరికి అమరావతి ప్రాంత రైతులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన వెళ్లే మార్గంలో పూలబాట ఏర్పాటు చేశారు. దారిపొడువునా పూలు చల్లి కృతజ్ఞతాపూర్వకంగా వీడ్కోలు చెప్పారు.

హైకోర్టు ప్రాంగణం దాటినప్పటి నుంచి రోడ్డు పక్కన నిలబడి ఆయనకు అభివాదం చేశారు. జాతీయ జెండాలు చేతబూని ఆయనకు నమస్కరించారు. జస్టిస్ మహేశ్వరి వంటి న్యాయమూర్తుల వల్ల తాము ధైర్యంగా ఉండగలుగుతున్నామని అమరావతి రైతులు తెలిపారు.

జస్టిస్‌ జేకే మహేశ్వరికి అమరావతి రైతుల వీడ్కోలు

ఇవీచూడండి:'రామతీర్థం ఘటన నిందితులను మూడురోజుల్లో పట్టుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details