తెలంగాణ

telangana

By

Published : May 6, 2022, 3:43 PM IST

Updated : May 6, 2022, 10:14 PM IST

ETV Bharat / business

మార్కెట్లపై వడ్డీ రేట్ల దెబ్బ.. రూ.4.31 లక్షల కోట్ల సంపద ఆవిరి

Stock Market Today: స్టాక్​ మార్కెట్లు శుక్రవారం సెషన్​లో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 867 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 271 పాయింట్లు క్షీణించింది. ఐటీ, రియల్​ ఎస్టేట్​, మెటల్​ షేర్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలు చవిచూడడం.. దేశీయ విపణులపైనా ప్రతికూల ప్రభావం చూపింది. ఇటీవల ఆర్​బీఐ వడ్డీరేట్లు పెంచడమూ ఇందుకు కారణమైంది.

మార్కెట్లకు నష్టాలు.
మార్కెట్లకు నష్టాలు.

Stock Market Today: భారత్​ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ (సెన్సెక్స్​) 867 పాయింట్లు కోల్పోయి 54,836కు చేరింది. జాతీయ​ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ (నిఫ్టీ) 271 పాయింట్ల నష్టంతో 16,411 వద్ద స్థిరపడింది. రియల్​ ఎస్టేట్​, మెటల్​, ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోవైపు విద్యుత్​ రంగం​ సూచీలు లాభాలను నమోదు చేశాయి. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ ఈరోజు రూ.4.31 లక్షల కోట్ల మేర ఆవిరైంది.

ఇంట్రాడే సాగిందిలా.. నష్టాల మధ్యే.. 54,928 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​ మరింత దిగజారి ఓ దశలో 54,586కు చేరింది. శుక్రవారం సెషన్​లో గరిష్ఠంగా 55,070 పాయింట్లు నమోదు చేసింది. మరోవైపు 16,415 వద్ద ప్రారంభమైన నిఫ్టీ కూడా నష్టాలను ఎదుర్కొంది. కనిష్ఠంగా 16,340.. గరిష్ఠంగా 16,484 పాయింట్లు నమోదు చేసింది.

బీఎస్​ఈ సెన్సెక్స్​లో టెక్ మహీంద్రా, పవర్​ గ్రిడ్​, ఐటీసీ, ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, ఎస్​బీఐఎన్​ సూచీలు లాభాలు గడించాయి. విప్రో, నెస్లే, బజాజ్​ ఫైనాన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. ఎన్​ఎస్​ఈ నిఫ్టీలో హీరోమోటార్స్​ కార్పొరేషన్​ టాప్​ గెయినర్​గా నిలిచింది. టాటా మోటార్స్​, ఆక్సిస్​ బ్యాంక్​, యూపీఎల్​ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.

ఇదీ చూడండి :వడ్డీ రేట్లు పెరుగుతున్న వేళ- ఆర్థిక ప్రణాళికలు వేసుకోండిలా..

Last Updated : May 6, 2022, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details