అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (సెన్సెక్స్) 329పాయింట్లు లాభపడి 35,171పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (నిఫ్టీ) 94పాయింట్లు పెరిగి 10,383 పాయింట్లకు చేరింది.
ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు వంటి హెవీ వెయిట్ షేర్ల దూకుడు స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది.