పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో.. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశీయ మార్కెట్లో వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
దేశ రాజధాని దిల్లీలో నేడు.. లీటర్ పెట్రోల్ ధర 9 పైసలు పెరిగి.. రూ.75.54కు చేరింది. డీజిల్ ధర లీటర్కు 11 పైసల వృద్ధితో రూ.68.51కు చేరింది.
ఇరాన్ జనరల్ ఖాసీం సులేమనీని.. ఇరాక్ రాజధాని బగ్దాద్ విమానాశ్రయంలో.. రాకెట్ దాడి చేసి మట్టుబెట్టింది అమెరికా. ఈ దాడితో.. పశ్చిమాసియాలో ఒక్కసారిగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఫలితంగా చమురు ధరలు ఆ రోజు 3 శాతానికిపైగా పెరిగాయి. చమురు అవసరాలకు దిగుమతులపైనే ఆధారపడే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
నాలుగు రోజుల్లో 55 పైసలు..
జనవరి 2 నుంచి లీటర్ పెట్రోల్ ధర 38 పైసలు, లీటర్ డీజిల్ ధర 55 పైసలు పెరిగాయి.