ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు వర్తకం విషయంలో మెరుగైన పనితీరు కనబర్చాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎగుమతులు- దిగుమతులు పెరిగాయని వెల్లడించింది. ఈ మేరకు యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ డెవలప్మెంట్(యూఎన్సీటీఏడీ).. 'గ్లోబల్ ట్రేడ్ అప్డేట్' పేరిట నివేదిక విడుదల చేసింది.
2020 గణాంకాలతో పోలిస్తే.. భారత్లో వస్తువుల దిగుమతులు 45 శాతం, సేవల దిగుమతులు 14 శాతం పెరిగాయని వెల్లడించింది. ఈ కాలంలో భారత్ నుంచి వస్తువుల ఎగుమతి 26 శాతం, సేవల ఎగుమతి 2 శాతం అధికమైనట్లు స్పష్టం చేసింది.
2019 సగటుతో పోలిస్తే వస్తువుల దిగుమతులు 10శాతం, సేవల దిగుమతులు 2 శాతం పెరిగాయని వివరించింది. 2019 గణాంకాలతో పోలిస్తే వస్తువుల ఎగుమతులు 7శాతం పెరగ్గా.. సేవల ఎగుమతులు 3 శాతం తగ్గాయి.