ఫినాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లుకోసం కసరత్త్తు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు ఎప్పుడు వస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.
డిపాజిటర్ల బీమా 5 రెట్లు పెంపు, దివాల స్మృతిలో ఇటీవలి మార్పుల నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.