తెలంగాణ

telangana

పద్దు 2020: వ్యవసాయ రంగం ఏం కోరుతోంది?

By

Published : Jan 24, 2020, 1:39 PM IST

Updated : Feb 18, 2020, 5:42 AM IST

ఆర్థిక మందగమనం సహా అనేక సవాళ్ల నడుమ ఫిబ్రవరి 1న బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో పద్దుపై వ్యవసాయ రంగం ఎలాంటి అంచనాలు పెట్టుకుంది. వ్యవసాయ రంగ నిపుణులు ఏమంటున్నారు?

CFA chief
ఎంజే ఖాన్

మోదీ 2.0 ప్రభుత్వం రెండో సారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో పద్దు ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ వచ్చిన ప్రతిసారి అన్ని వర్గాల్లో ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశలు ఉంటాయి. అలా ఈ సారి బడ్జెట్​పై వ్యవసాయ రంగం అంచనాలు ఎలా ఉన్నాయి? ఈ విషయం తెలుసుకునేందుకు ఛాంబర్ ఆఫ్​ ఫుడ్​ &అగ్రికల్చర్​ (ఐసీఎఫ్​ఏ) ఛైర్మన్​ డా.ఎంజే ఖాన్​ను సంప్రదించింది ఈటీవీ భారత్​.

ఖాన్ ఏమన్నారంటే..

రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు వ్యవసాయ రంగ ఎగుమతులు రెట్టింపు చేయాల్సిన అవసరముందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపిన విషయాన్ని ఖాన్​ గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన అంశాలపై కసరత్తు అవసరమని.. రానున్న బడ్జెట్​లో దీనికి సంబంధించిన ప్రోవిజన్​లు ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

వ్యవసాయ రంగంలో అభివృద్ధి నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కనుక దేశ ఆర్థిక స్థితి కోణంలో.. వ్యవసాయ రంగంలో పలు కొత్త పథకాలు అవసరమని ఖాన్ తెలిపారు. వాటితోపాటు ఇప్పటికే ఉన్న కొన్ని పాలసీల్లో మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రోవిజన్​లూ ఉండొచ్చని ఆశిస్తున్నట్లు ఖాన్ తెలిపారు.

లక్ష్యం 2022 అయితే..

రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే వ్యవసాయ రంగంలో బహిరంగ వాణిజ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని ఖాన్ పేర్కొన్నారు.

రైతులు ఎక్కడైనా అమ్మకాలు, కొనుగోళ్లు జరిపేందుకు వీలు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఫార్మర్ ప్రొడ్యూసర్​ స్కీం (ఎఫ్​పీఓ)ను అనేక వ్యాపారాలకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మొత్తం మీద ఈ సారి బడ్జెట్​లో ప్రజాకర్షక పథకాలు కాకుండా.. ఇలాంటి సాంకేతిక అంశాలపై కేంద్రం దృష్టి సారిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎంజే ఖాన్.

ఇదీ చూడండి:పద్దు 2020: దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను రద్దు?

Last Updated : Feb 18, 2020, 5:42 AM IST

ABOUT THE AUTHOR

...view details