తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ జరిమానా చెల్లింపునకు సిద్ధమైన వాల్​మార్ట్

రిటైల్ దిగ్గజం వాల్​మార్ట్​ అమెరికా నియంత్రణ సంస్థలు విధించిన 282 మిలియన్​ డాలర్ల జరిమానా చెల్లించేందుకు సిద్ధమైంది. వాల్​మార్ట్ మధ్యవర్తుల లావాదేవీలపై అవినీతి ఆరోపణలతో ఈ జరిమానా విధించాయి నియంత్రణ సంస్థలు.

By

Published : Jun 21, 2019, 1:05 PM IST

వాల్​మార్ట్

అవినీతి నిరోధక నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైల్ దిగ్గజం వాల్​మార్ట్ 282 మిలియన్​ డాలర్ల జరిమానా చెల్లించేందుకు సిద్ధమైంది.జరిమానా

ఎందుకంటే...

భారత్, చైనా, బ్రెజిల్​, మెక్సికోల్లో నిర్వహిస్తున్న వాల్​మార్ట్​ వ్యాపారాల్లో మధ్యవర్తులు సహేతుకమైన కారణాలు వెల్లడించకుండా.. విదేశీ ప్రభుత్వ అధికారులకు చెల్లింపులు చేశారనే ఆరోపణలతో ఈ జరిమానా విధించింది అమెరికా సెక్యూరిటీస్​, ఎక్ఛేంజి కమిషన్​(ఎస్​ఈసీ). ఈ కారణంగా ఎస్​ఈసీ ఆదేశాలు అమలు చేసే 'విదేశీ అవినీతి పద్ధతుల చట్టం(ఎఫ్​సీపీఏ)' ద్వారా చర్యలకు సిద్ధమైనట్లు పేర్కొంది.

ఈ జరిమానాలో 144 మిలియన్​ డాలర్లు ఎస్​ఈసీకి, 138 మిలియన్​ డాలర్లు ఎఫ్​సీపీఏలో నమోదైన క్రిమినల్ ఆరోపణలు ఎత్తివేసేందుకు చెల్లించాలని వాల్​మార్టుకు నోటీసులు ఇచ్చింది.

ఇదీ కారణం: ఫేస్​బుక్​ క్రిప్టోకరెన్సీపై భిన్నాభిప్రాయాలు

ABOUT THE AUTHOR

...view details