తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2019, 6:40 AM IST

ETV Bharat / business

సంపన్నుల కోసం శాంసంగ్ లగ్జరీ స్క్రీన్.. ధర రూ.12 కోట్లు!

విలాస వసతులు కోరుకునే సంపన్నులే లక్ష్యంగా శాంసంగ్​ ఇండియా ఓ సరికొత్త ఎల్​ఈడీ స్క్రీన్​ను మార్కెట్లోకి తీసుకురానుంది. రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల ధరతో మూడు సైజులలో  ఈ డిస్​ప్లేలను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది శాంసంగ్​.

SAMSUNG
శాంసంగ్​ వాల్​

ఎలక్ట్రానిక్​ దిగ్గజం శాంసంగ్​.. సరికొత్త మాడ్యులర్​ మైక్రో ఎల్​ఈడీ డిస్​ప్లే 'ది వాల్​'ను భారత మార్కెట్​కు పరిచయం చేసింది. జాయింట్​ స్క్రీన్​తో 146 అంగుళాలు, 219 అంగుళాలు, 292 అంగుళాల వేరియంట్లలో ఈ డిస్​ప్లేలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. వీటి ధరలు రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉండనున్నట్లు పేర్కొంది.

లగ్జరీ స్క్రీనింగ్​ అనుభూతిని కోరుకునే సంపన్నులే లక్ష్యంగా ఈ డిస్​ప్లేను పరిచయం చేసినట్లు శాంసంగ్ తెలిపింది. 2022 నాటికి 200 యూనిట్లు విక్రయించి రూ.498 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శాంసంగ్​ ఇండియా ఉపాధ్యక్షుడు (కన్సూమర్ ఎలక్ట్రానిక్స్) పునీత్​ సేతి తెలిపారు.

భారత్​లో ప్రస్తుతం 140 మంది బిలియనీర్​లు, 950 మంది మల్టీ మిలియనీర్​లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ స్క్రీన్​లకు మెట్రో, నాన్​ మెట్రో పట్టణాల నుంచి డిమాండ్​ ఉండొచ్చని శాంసంగ్​ భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్​, బెంగళూరు, పుణె, లుథియానా, అహ్మదాబాద్​, ఛండీగఢ్​ల నుంచి ఎక్కువగా డిమాండ్​ ఉంటుందని అంచనా వేస్తోంది.

ది వాల్​ ప్రత్యేకతలు..

ది వాల్ 146 అంగుళాల డిస్​ప్లే.. మైక్రో ఎల్​ఈడి సదుపాయంతో లభించనుంది.

219 అంగుళాల డిస్​ప్లే.. 6కే డెఫినిషన్​తో.. 292 అంగుళాల డిస్​ప్లే 8కే డెఫినిషిన్​తో రూపొందిస్తున్నారు.

ది వాల్​తో వినియోగదారులు ఇంతకు ముందు ఎన్నడూ లేని స్క్రీన్​ అనుభూతి పొందుతారని శాంసంగ్ చెబుతోంది. ఈ డిస్​ప్లేలలో 0.8 ఎంఎం పిక్సెల్​ పిఛ్​ టెక్నాలజీ పొందుపరిచినట్లు తెలిపింది. దీని ద్వారా సినిమా, వీడియోలలో లగ్జరీ వినియోగదారులు అనుభూతి పొందుతారని శాంసంగ్ పేర్కొంది.

అన్ని రకాల ఓఎస్​లకు ది వాల్ అనుకూలంగా ఉండనున్నట్లు శాంసంగ్ తెలిపింది.

ది వాల్​ ప్రొఫెషనల్ వెర్షన్​ను అందుబాటులోకి తేనుంది శాంసంగ్. పెద్ద పెద్ద వ్యాపారాలకు, రిటైలర్లకు ఇది ఉపయోగకరంగా ఉండనున్నట్లు తెలిపింది. ఇది పూర్తి కస్టమైజబుల్​ ఫీచర్లతో రానున్నట్లు పేర్కొంది.

ది వాల్​ను పూర్తిగా ఆఫ్​ ​చేయాల్సిన అవసరం లేకుండా రూపొందించినట్లు శాంసంగ్​ వెల్లడించింది. ఎక్కువ సమయం వాడకపోతే.. ఇంటీరియర్​కు తగ్గట్లు సీనరీలు, ఆర్ట్​ల వంటివి డిస్​ప్లే అవుతూ ఉంటాయని తెలిపింది.

ఇదీ చూడండి:ఉల్లి రైతు రికార్డ్​- కిలో రూ.200కు విక్రయం

ABOUT THE AUTHOR

...view details