ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్.. సరికొత్త మాడ్యులర్ మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే 'ది వాల్'ను భారత మార్కెట్కు పరిచయం చేసింది. జాయింట్ స్క్రీన్తో 146 అంగుళాలు, 219 అంగుళాలు, 292 అంగుళాల వేరియంట్లలో ఈ డిస్ప్లేలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. వీటి ధరలు రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉండనున్నట్లు పేర్కొంది.
లగ్జరీ స్క్రీనింగ్ అనుభూతిని కోరుకునే సంపన్నులే లక్ష్యంగా ఈ డిస్ప్లేను పరిచయం చేసినట్లు శాంసంగ్ తెలిపింది. 2022 నాటికి 200 యూనిట్లు విక్రయించి రూ.498 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శాంసంగ్ ఇండియా ఉపాధ్యక్షుడు (కన్సూమర్ ఎలక్ట్రానిక్స్) పునీత్ సేతి తెలిపారు.
భారత్లో ప్రస్తుతం 140 మంది బిలియనీర్లు, 950 మంది మల్టీ మిలియనీర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ స్క్రీన్లకు మెట్రో, నాన్ మెట్రో పట్టణాల నుంచి డిమాండ్ ఉండొచ్చని శాంసంగ్ భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పుణె, లుథియానా, అహ్మదాబాద్, ఛండీగఢ్ల నుంచి ఎక్కువగా డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తోంది.
ది వాల్ ప్రత్యేకతలు..
ది వాల్ 146 అంగుళాల డిస్ప్లే.. మైక్రో ఎల్ఈడి సదుపాయంతో లభించనుంది.