అవినీతి ఆరోపణలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు ఒక్క సారిగా కుప్పకూలాయి. ఆ సంస్థ ప్రధాన అధికారులు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలతో బీఎస్ఈలో సంస్థ షేరు విలువ ప్రస్తుతం 14.60 శాతం నష్టంతో.. రూ.659.65 వద్ద కొనసాగుతోంది.
ఆరోపణలేంటంటే...
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ.. ఉద్యోగులుగా చెప్పుకుంటున్న ఓ గుర్తుతెలియని బృందం తీవ్ర ఆరోపణలు చేసింది. వారిద్దరు స్పల్పకాలంతో అధిక లాభాలు ఆర్జించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని పెర్కొంది. దీనిపై అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కారణంగా ఇటు దేశీయ మార్కెట్లలోనూ.. అటు అమెరికా మార్కెట్లలోనూ ఇన్ఫోసిస్ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 2013 తర్వాత సంస్థ షేర్లు ఈ స్థాయిలో కుప్పకూలడం ఇదే ప్రథమం.