కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇచ్చిన ఉద్దీపనల ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించిన వడ్డీ రేట్ల తగ్గింపును కంపెనీలు, వినియోగదారులకు బ్యాంకులు ఎలా బదిలీ చేస్తున్నాయి.. అనే అంశం కూడా ఇందులో ఉన్నట్లు తెలిపారు. పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, వాణిజ్య రంగ జరిగిన సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు సీతారామన్. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) 'ఆత్మ నిర్భర్ భారత్'లో ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ రుణాలను కూడా ఎలా అందిస్తున్నారో సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
లబ్ధిదారుకు మెరుగవుతున్న ప్రయోజనాలు..