కొవిడ్-19 మహమ్మారి కారణంగా భారత్లో నిరుద్యోగిత రేటు 27.11 శాతానికి ఎగబాకిందని భారతీయ ఆర్థికవ్యవస్థ పరిశీలక సంస్థ- సీఎంఐఈ తెలిపింది. కరోనాకు ముందు మార్చి మాసం మధ్యలో 7 శాతం లోపుగా ఉన్న ఈ నిరుద్యోగ రేటు మే 3 నాటికి 27.11 శాతానికి చేరిందని.. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు ముంబయి కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ తెలిపింది.
పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా రెడ్జోన్లుండగా.. అక్కడ నిరుద్యోగిత రేటు 29.22 శాతంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 26.69 శాతంగా ఉందని వెల్లడించింది. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ఎన్నడూ లేనంతగా నిరుద్యోగిత పెరిగిపోతోందని అభిప్రాయపడింది