తెలంగాణ

telangana

ETV Bharat / business

శనివారం పనిచేయనున్న స్టాక్​ మార్కెట్లు- కారణం ఇదే... - బడ్జెట్‌ రోజున మార్కెట్లు పనిచేస్తాయ్‌: బీఎస్​ఈ

ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1న స్టాక్​మార్కెట్లు పనిచేయనున్నాయి. సాధారణంగా శని, ఆదివారాలు మార్కెట్లకు సెలవు దినాలు. అయితే ఈసారి ట్రేడర్ల విజ్ఞప్తి మేరకు బడ్జెట్​ రోజున మార్కెట్ ట్రేడింగ్​ కొనసాగుతుందని బీఎస్​ఈ ప్రకటించింది.

Stock markets to be open on Budget day
బడ్జెట్‌ రోజున మార్కెట్లు పనిచేస్తాయ్‌: బీఎస్​ఈ

By

Published : Jan 22, 2020, 5:10 PM IST

Updated : Feb 18, 2020, 12:15 AM IST

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1న స్టాక్​మార్కెట్లు పనిచేస్తాయని బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ సర్క్యులర్​ను జారీ చేసింది.

ప్రత్యేక పరిస్థితుల్లో

ఫిబ్రవరి 1 శనివారం. సాధారణంగా శని, ఆదివారాల్లో మార్కెట్లకు సెలవు. ప్రత్యేక పరిస్థితులు మినహా సెలవు దినాల్లో మార్కెట్లు పనిచేయవు. అయితే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఈ సారి శనివారం కూడా ట్రేడింగ్ నిర్వహించాలని బీఎస్​ఈ నిర్ణయించింది. సాధారణ రోజుల్లానే ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 నిమిషాల వరకు సెషన్​ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ట్రేడర్ల అభ్యర్థన మేరకు

2020-21 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెడుతున్న ఈ కేంద్ర బడ్జెట్​లో ఈసారి కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 1న ట్రేడింగ్ నిర్వహించాలని చాలా మంది ట్రేడర్లు అభ్యర్థించారు. ఫలితంగానే బీఎస్​ఈ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

జైట్లీ హయాంలోనూ

2015లోనూ ఇలాగే జరిగింది. ఫిబ్రవరి 28న అప్పటి ఆర్థికమంత్రి అరుణ్​జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రోజు శనివారం అయినప్పటికీ మార్కెట్లు పనిచేశాయి.

సంప్రదాయం మారింది

2001కి ముందు కేంద్ర బడ్జెట్​ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. బడ్జెట్​ నిర్ణయాలు మరుసటి రోజు మార్కెట్ ట్రేడింగ్​పై ప్రభావం చూపేవి. అయితే ఆ తరువాత ఈ సంప్రదాయం మారింది. బడ్జెట్​ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెడుతూ వస్తున్నారు.

ఇదీ చూడండి: రూపాయి బలపడింది... బంగారం ధర తగ్గింది

Last Updated : Feb 18, 2020, 12:15 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details