తెలంగాణ

telangana

ETV Bharat / business

యువతకు రైలు టికెట్​ ధరపై 50 శాతం డిస్కౌంట్​! - రైలు టికెట్​ ధరపై 50 శాతం డిస్కౌంట్​!

భారతీయ రైల్వే.. యువతకు రైల్వే టికెట్​ ధరపై 50 శాతం డిస్కౌంట్​ అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. 'ఏక్​ భారత్​ శ్రేష్ఠ భారత్​' కార్యక్రమంలో భాగంగా ఈ ప్రయోజనం కల్పిస్తోంది.

railways offers 50 percent concession for youth participating in ek bharat shrestha bharat programme
యువతకు రైలు టికెట్​ ధరపై 50 శాతం డిస్కౌంట్​!

By

Published : Jan 3, 2020, 8:13 PM IST

భారతీయ రైల్వే యువత కోసం ఓ బంపర్​ ఆఫర్​ తీసుకొచ్చింది. రైల్వే టికెట్​ ధరపై ఏకంగా 50 శాతం డిస్కౌంట్​ అందిస్తోంది. 'ఏక్​ భారత్​ శ్రేష్ఠ భారత్​' కార్యక్రమంలో భాగంగా ఈ సదుపాయం కల్పిస్తోంది.

అర్హులు ఎవరు?

సెకెండ్​, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించే యువతకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. అది కూడా నెలకు ఆదాయం రూ.5000 లోపు ఉండాలి. అలాగే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పయనిస్తుండాలి. రైలు ఎక్కే, దిగే స్టేషన్లకు మధ్య కనీస దూరం 300 కిలోమీటర్లు ఉండాలి.

'డిస్కౌండ్ టికెట్​' ​ప్రయోజనం పొందడానికి మానవ వనరుల అభివృద్ధిశాఖ సెక్రటరీ నుంచి సర్టిఫికేట్​ కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.

యువతకు రైలు టికెట్​ ధరపై 50 శాతం డిస్కౌంట్​!

సాధారణ సర్వీసులకు మాత్రమే!

ఈ తగ్గింపు ప్రయోజనం సాధారణ ట్రైన్​ సర్వీసులకు (మెయిల్​, ఎక్స్​ప్రెస్​) మాత్రమే వర్తిస్తుంది. స్పెషల్​ ట్రైన్లు, ప్రత్యేక కోచ్​లకు వర్తించదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక, చట్టబద్ధ సంస్థలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాల ఖర్చులతో ప్రయాణించే వారికి కూడా ట్రైన్​ టికెట్లపై తగ్గింపు ప్రయోజనం వర్తించదు.

ప్రాథమిక ఛార్జీకే వర్తింపు

50 శాతం తగ్గింపు ప్రయోజనం కేవలం రైలు టికెట్​ ప్రాథమిక ఛార్జీకి (బేసిక్ ఫేర్​) మాత్రమే వర్తిస్తుంది. రిజర్వేషన్​ ఛార్జీలు, ఇతర సప్లిమెంటరీ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సిందే.

ఇదీ చూడండి:వ్యాపార మాయాజాలంలో పడ్డారో.. మీ జేబు గుల్లే!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details