భారత్కు చెందిన ప్రముఖ డిజిటల్ వ్యాలెట్, పేమెంట్స్ కంపెనీ మొబిక్విక్ ఈ ఏడాది సెప్టెంబర్లో తొలి పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 200 నుంచి 250 మిలియన్ డాలర్లు సేకరించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో వినియోగదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పింది ఆ సంస్థ.
వినియోగదారులకు సంబంధించిన సమాచారం సమారు 8.2 టీబీ లీకైనట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాజశేఖర్ రాజహరియా, ఫ్రెంచ్ పరిశోధకుడు ఇలియట్ అల్డర్సన్ ట్వీట్ చేశారు. యూజర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్, పాస్వర్డ్లు, చిరునామాలు, బ్యాంక్ ఖాతాలు, వివిధ కార్డుల వివరాలు మొత్తం అందులో ఉన్నాయని తెలిపారు.