జీవీకే గ్రూపునకు చెందిన ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు అదానీ గ్రూపు చేతికి వెళ్లిపోనుందని ప్రచారం సాగుతోంది. ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ఎంఐఏఎల్ (ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్)లో జీవీకే గ్రూపునకు ఉన్న వాటాను కొనుగోలు చేయటానికి అదానీ గ్రూపు సంప్రదింపులు సాగిస్తున్నట్లు తెలిసింది.
ఎంఐఏఎల్లో ప్రస్తుతం జీవీకేకు 50.5% వాటా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు 26 శాతం వాటా ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, బిడ్వెస్ట్ గ్రూపు చేతిలో మిగిలిన వాటా ఉంది. గతేడాది మార్చిలో బిడ్వెస్ట్ గ్రూపు వాటా కొనుగోలు చేయటానికి అదానీ గ్రూపు ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాన్ని జీవీకే గ్రూపు అడ్డుకుంది. ఆ వాటా తానే కొనుగోలు చేస్తానని స్పష్టం చేసింది. కానీ అందుకు అవసరమైన సొమ్ము సమకూర్చులేకపోయింది. ఆ తర్వాత ఈ వ్యవహారం న్యాయస్థానం వరకూ వెళ్లింది.
ఆ స్థానంలో అదానీ.!