స్టాక్ మార్కెట్లకు ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయి. దేశీయంగా 2019-20 మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి దాదాపు ముగింపు దశకు చేరుకుంది. కీలక గణాంకాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ పరిణామాలు, కరోనా వైరస్ ప్రభావం వంటి వాటిపైనే మదుపరులు దృష్టి సారించే అవకాశముంది.
మహాశివరాత్రి సందర్భంగా ఎక్స్చేంజ్లకు శుక్రవారం సెలవు. ఈ పరిణామాలన్నింటి నడుమ సూచీలు 'రేంజ్ బౌండ్'లో కొనసాగే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.