తెలంగాణ

telangana

పీఎఫ్ ఖాతాదారులకు ఊరట- ఆధార్​తో పుట్టిన తేదీ మార్పు

By

Published : Apr 5, 2020, 8:25 PM IST

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం మరో ఊరట కల్పించింది. పుట్టిన తేదీ మార్పులు సహా ఆన్​లైన్​లో కేవైసీ పూర్తి చేయడానికి ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. లాక్​డౌన్​ నేపథ్యంలో ఆన్​లైన్​ సేవలు అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

EPFO to accept Aadhaar as birth proof online from subscribers
పీఎఫ్ ఉద్యోగులకు ఊరట

పీఎఫ్ ఖాతాదారుల విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పుట్టిన తేదీ ఆన్ లైన్ ధ్రువీకరణ కోసం ఇక నుంచి ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్​లైన్​ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర శ్రామిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పుట్టిన తేదీ మార్పులకోసం ఆన్ లైన్ లో అర్జీ పెట్టుకోవచ్చని తెలిపింది.

"కేవైసీ నిర్ధరణ కోసం పీఎఫ్ సభ్యులు రికార్డుల్లోని తమ పుట్టిన తేదీని సవరించుకునేందుకు నిబంధనలు సవరించి ఫీల్డ్ అధికారులకు ఈపీఎఫ్ఓ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్-19 విస్తృతి నేపథ్యంలో ఆన్ లైన్ సేవలు అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది."-శ్రామిక మంత్రిత్వ శాఖ ప్రకటలోని భాగం

పీఎఫ్ సభ్యులు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ద్వారా తక్షణమే తమ పుట్టిన తేదీని ధ్రువీకరించుకోవచ్చని శ్రామిక శాఖ పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రాసెసింగ్ సమయాన్ని కూడా తగ్గించవచ్చని తెలిపింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల ఆన్ లైన్ నాన్-రీఫండబుల్ విత్ డ్రా అభ్యర్థనలను వేగంగా పరిష్కరించాలని ఫీల్డ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది.

అంతకుముందు మూడు నెలల వేతనాన్ని విత్ డ్రా చేసుకునే వీలు కల్పిస్తూ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రం. కరోనా వైరస్ కారణంగా లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం ప్రకటించింది. అయితే కేవైసీ పూర్తి చేసిన సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది.

ఇదీ చదవండి:ఆర్థిక మాంద్యం 2008 X 2020.. ఏంటి తేడా?

ABOUT THE AUTHOR

...view details