భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సైనికులు, అధికారులు వెంటనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తొలగించాలని ఆదేశించింది. జులై 15లోపు 89 యాప్లను మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాలని పేర్కొంది. సమాచార భద్రతా ఉల్లంఘన, హనీట్రాప్(వలపు ఉచ్చు) వంటి ఘటనల నేపథ్యంలో సైన్యం కఠినంగా వ్యవహరిస్తోంది.
ప్రస్తుత ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైన్యం హెచ్చరించింది. టిక్టాక్, హెలో, షేర్ఇట్ సహా ప్రభుత్వం నిషేధించిన 59 యాప్లు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. 'పాకిస్థాన్, చైనా ఇంటలిజెన్స్ వర్గాలు ఆన్లైన్లో సైనికులను లక్ష్యంగా ఎంచుకుంటున్న ఘటనలు పెరుగుతుండటంతో ఈ ఆదేశాలు జారీ చేశాం' అని సైనికాధికారి ఒకరు తెలిపారు.