తెలంగాణ

telangana

ETV Bharat / briefs

యువీకి బీసీసీఐ అనుమతి నిరాకరణ!

దేశవాళీ క్రికెట్​లో ఆడేందుకు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలనుకున్న మాజీ క్రికెటర్​ యువరాజ్​సింగ్​కు బీసీసీఐ అనుమతి నిరాకరించినట్లు తెలిసింది. ఒకవేళ బోర్డు నుంచి అతడికి అనుమతి లభిస్తే పంజాబ్​ తరఫున దేశవాళీ క్రికెట్​లో ఆడతాడు.

By

Published : Dec 30, 2020, 7:35 AM IST

Updated : Dec 30, 2020, 9:26 AM IST

yuvi
యూవీ

పంజాబ్‌ తరఫున దేశవాళీ క్రికెట్​లో ఆడడం కోసం రిటైర్మెంట్​ వెనక్కి తీసుకోవడానికి సిద్ధమైన మాజీ క్రికెటర్​ యువరాజ్‌సింగ్‌కు చుక్కెదురైంది. బీసీసీఐ అతడికి అనుమతి నిరాకరించినట్లు సమాచారం. నిరుడు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన యువీ.. కెనడా టీ20, అబుదాబి టీ10 లీగ్స్‌లో ఆడాడు. రిటైరైన ఆటగాడు కావడం వల్ల బీసీసీఐ అనుమతి లేకుండానే ఆ టోర్నీల్లో ఆడాడు. ఆ కారణంగానే.. మళ్లీ దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు బోర్డు అతడికి అనుమతిని నిరాకరించినట్లు తెలిసింది.

2000 ఏడాదిలో దాదా కెప్టెన్సీలో భారత జట్టులోకి వచ్చిన యూవీ సుదీర్ఘకాలం రాణించాడు. తన బ్యాటింగ్‌తో ఎన్నో మధుర విజయాలు అందించాడు. టీమ్‌ఇండియా 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో రెండోసారి వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో ముఖ్యభూమిక పోషించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయకపోవడం వల్ల ఆటకు వీడ్కోలు పలికాడు.

ఇదీ చూడండి :నెట్స్​లో యూవీ సాధన.. సిక్స్​తో సందడి

Last Updated : Dec 30, 2020, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details