తెలంగాణ

telangana

By

Published : May 10, 2021, 2:25 PM IST

ETV Bharat / bharat

రైలు కింద పడి ముగ్గురు పిల్లలు, తల్లి మృతి

కుటుంబ కలహాలతో రాజస్థాన్​లోని ఓ మహిళ తన అయిదుగురు పిల్లలతో పాటు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతిచెందగా.. మరో ఇద్దరు చివరి నిమిషంలో తల్లి చెయ్యిని వదిలించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగా ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

woman, train
రైలు కింద పడి ముగ్గురు పిల్లలు, తల్లి మృతి

రాజస్థాన్​ దౌసలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సమస్యలతో విసిగిపోయిన ఓ తల్లి కన్నబిడ్డలతో కలిసి కదులుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మరణించింది. ఆమెతో పాటు ముగ్గురు పిలల్లు చనిపోయారు. మరో ఇద్దరు బతికి బయటపడ్డారు. పట్టలపై ఉన్న వీరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టాలపై మృతదేహాలు
మృతదేహాల తరలింపు
మృతదేహాలను తరలిస్తున్న సిబ్బంది
రైలు కిందపడిన బాలుడు

వారిద్దరు మాత్రం...

ఐదుగురు పిల్లలను తీసుకుని పట్టాలపైకి వెళ్లింది ఆ మహిళ. ఈ క్రమంలో.. రైలు వస్తుండటం చూసి ఆ ఐదుగురిలో ఇద్దరు.. తల్లి చెయ్యిని వదిలించుకుని అక్కడి నుంచి తప్పించుకున్నారు. చివరికి ముగ్గురు పిల్లలు సహా తల్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

చనిపోయిన మహిళ భర్త స్థానికంగా ఉండే రైల్వేగేటు వద్ద గేట్​ మ్యాన్​గా పని చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. అతను మాండవర్​లోని బావిఖేడా గ్రామంలో నివసిస్తున్నాడని చెప్పారు. ఈ ఘటనపై మాండవర్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

ఇదీ చూడండి:అంత్యక్రియలకు తోపుడు బండిపైనే తల్లి మృతదేహం

ABOUT THE AUTHOR

...view details