తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీదీ.. మీరు మారిపోయారు, ముందులా లేరు: మోదీ

By

Published : Mar 7, 2021, 10:58 AM IST

Updated : Mar 7, 2021, 3:56 PM IST

WB Assembly polls
లైవ్​: బంగాల్​లో ప్రధాని సభకు హాజరైన మిథున్​ చక్రవర్తి

15:35 March 07

దీదీ చాలా కాలంగా తెలుసు..

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవినీతికి పాల్పడి, బంగాల్ ప్రజలను దోచుకున్నారని, అంపన్​ తుపానుకు ఇచ్చిన రిలీఫ్​ ప్యాకేజీని కూడా లూటీ చేశారని ఆరోపించారు.

"దీదీ నాకు చాలా కాలంగా తెలుసు. వామపక్షాలకు వ్యతిరేకంగా గళం విప్పిన వ్యక్తి ఆమెలో ఇప్పుడు లేరు. ఇప్పుడామె వేరొకరి భాష మాట్లాడుతున్నారు, వారే ఆమెను నియంత్రిస్తున్నారు."

                   - నరేంద్ర మోదీ, ప్రధాని

15:15 March 07

రైతులు, వ్యాపారవేత్తలు, సోదరీమణులు, కుమార్తెల అభివృద్ధికి తాము తీవ్రంగా కృషి చేస్తున్నాం అని నమ్మకం కలిగించేందుకే ఇక్కడకు వచ్చానని మోదీ అన్నారు. మీ కలలను సాకారం చేసేందుకు ప్రతి క్షణం మేము శ్రమిస్తామని బంగాల్​ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.

'ఇక్కడ ప్రజా స్వామ్య వ్యవస్థ ఎలా ధ్వంసమైందో మీకు తెలుసు. భాజపా తిరిగి దానిని బలోపేతం చేస్తుంది. ప్రభుత్వం, పోలీసులపై ప్రజలకు తిరిగి నమ్మకం పెరిగేలా మేము మార్పు తెస్తాం.' - మోదీ

15:10 March 07

  • రాబోయే 25ఏళ్లు బంగాల్‌ అభివృద్ధిలో కీలకం: మోదీ
  • 2047నాటికి బంగాల్ మరోసారి దేశానికి నాయకత్వం వహిస్తుంది: మోదీ
  • బంగాల్‌కు భారీగా పెట్టుబడులు రప్పిస్తాం: మోదీ

14:51 March 07

  • బంగాల్ ప్రజలు శాంతి, సోనార్‌ బంగ్లాను కోరుకుంటున్నారు: మోదీ
  • సోనార్ బంగ్లా కలను భాజపా సాకారం చేస్తుంది: ప్రధాని మోదీ
  • బంగాల్‌ అభివృద్ధికి హామీ ఇస్తున్నా: ప్రధాని మోదీ
  • బంగాల్‌ సంస్కృతి, కళల పరిరక్షణ చర్యలు చేపడతాం: మోదీ

14:07 March 07

కోల్​కతాలో మోదీ

కోల్​కతాలో మోదీ 

కోల్​కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. బ్రిగేడ్​ పరేడ్​ మైదాన్​లోని సభా వేదిక వద్దకు వెళ్లేందుకు ఆయన పయనమయ్యారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా మోదీ తెలిపారు. పార్టీ కార్యకర్తలతో పాటు, బంగాల్​ ప్రజల మధ్య జరగనున్న సభలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. 

13:55 March 07

టీఎంసీ ఓ ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీ: సువేందు

సభలో ప్రసంగిస్తున్న భాజపా నేత సువేందు అధికారి

బ్రిగేడ్​ పరేడ్​ మైదాన్​లోని భాజపా ఎన్నికల ప్రచార సభలో తృణమూల్​ కాంగ్రెస్​పై భాజపా నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీఎంసీ అంటే రాజకీయ పార్టీ కాదని, ఓ ప్రైవేట్​  లిమిటెడ్​ కంపెనీ అని విమర్శించారు. ఆ కంపెనీకి ఛైర్మన్​ మమతా బెనర్జీ కాగా, ఆమె అల్లుడు దానికి ఎండీ అని ఎద్దేవా చేశారు.  

13:32 March 07

భారీగా ప్రజలు..

ప్రధాని మోదీ.. మరికొద్దిసేపట్లో కోల్​కతాకు చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో పాల్గొనున్నారు. ఇందుకోసం ప్రజలు భారీ స్థాయిలో బ్రిగేడ్​ గ్రౌండ్​కు తరలివెళ్లారు. మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నారు.

12:54 March 07

లైవ్​: భాజపా తీర్థం పుచ్చుకున్న మిథున్​ చక్రవర్తి

భాజపాలోకి మిథున్​ చక్రవర్తి..

బంగాల్​లో ప్రధాని సభా వేదికగా.. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి భాజపాలో చేరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి  కైలాశ్ విజయవర్గీయ, బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. 

10:16 March 07

లైవ్​: బంగాల్​ గడ్డపై మోదీ భారీ ఎన్నికల ర్యాలీ

బంగాల్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు పార్టీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్ మైదానంలో నిర్వహించే భాజపా ప్రచార సభలో నేడు ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

కోల్​కతా నగరవ్యాప్తంగా  1,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వేదికను పర్యవేక్షించడానికి డ్రోన్​ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఈ సభకు 7 లక్షల మంది వరకు హాజరవనున్నారని అంచనా వేస్తున్నారు. బ్రిగేడ్ పరేడ్​ మైదానం ప్రవేశ మార్గం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత తొలిసారిగా బంగాల్​లో మోదీ పర్యటిస్తుండటం గమనార్హం.

Last Updated : Mar 7, 2021, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details