సైన్యం అంటే సాధారణంగా పురుషులే అధికంగా ఉంటారు. అయితే మారుతోన్న పరిస్థితుల నేపథ్యంలో మహిళలు సైతం పురుషులకు దీటుగా సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాజస్థాన్లోని సరిహద్దు భద్రతా దళంలో సేవలందిస్తోన్న మహిళా జవాన్లే ఇందుకు నిదర్శనం.
రాజస్థాన్లో భారత్-పాక్ సరిహద్దు శ్రీగంగానగర్ సెక్టార్లో మహిళా జవాన్లే విధులు నిర్వహిస్తున్నారు. 210 కి.మీ పొడవైన ఈ సరిహద్దు ప్రాంతంలో కనీసం 50మంది మహిళా జవాన్లు గస్తీ కాస్తున్నారు. మహిళా అధికారులే పర్యవేక్షణ విధులు నిర్వహించడం విశేషం.