విశ్వాసానికి మారు పేరు శునకం అనటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి ఘటనే కర్ణాటక విజయపుర జిల్లా దేవరహిప్పరగి మండలంలో జరిగింది. ఫార్మ్హౌస్లోకి వచ్చిన పామును చంపి.. యజమాని ప్రాణాలను రక్షించింది ఓ శునకం. అయితే ఈ ఘటనలో కుక్క చనిపోయింది.
పాముతో పోరాడి మృతి చెందిన శునకం శునకాన్ని ఖననం చేస్తున్న యజమాని అసలేం జరిగింది?
కర్ణాటక విజయపుర జిల్లా దేవరహిప్పరగి మండలానికి చెందిన కల్లన్న గౌడ పాటిల్.. 9 ఏళ్ల క్రితం రూ. 5వేలకు ఓ శునకాన్ని కొన్నాడు. దానికి 'రాజా' అని నామకరణం చేసి పెంచుకుంటున్నాడు. కల్లన్న గౌడ ఫార్మ్హౌస్కు కాపాలాగా ఉండేది ఆ శునకం. అయితే రెండు రోజుల క్రితం కల్లన్న గౌడ.. పొలం పనిలో నిమగ్నమైన సమయంలో ఓ పాము అటుగా వచ్చింది. ఆ విషయాన్ని కల్లన్న గమనించలేదు. కానీ రాజా ఆ పాముతో పోరాడి.. దాన్ని చంపేసింది. పాము విష ప్రభావంతో కొద్దిసేపటికి కుక్క కూడా ప్రాణాలు విడిచింది.
9 ఏళ్లు పెంచుకున్న శునకం(రాజా) మృతితో కల్లన్న తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.
ఇదీ చదవండి :ఇంటి ఓనర్కు నిప్పంటించిన అద్దెదారు- చిన్నారి మృతి