కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలు, పాత్రికేయులు, ఆర్ఎస్ఎస్ నేతల ఫోన్ల ట్యాపింగ్పై రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్కు చెందిన పెగాసుస్ స్పైవేర్ సంస్థ ట్యాపింగ్ చేసినట్లు విదేశీ మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తాయన్న వదంతులు వస్తున్నాయని స్వామి పేర్కొన్నారు. అవి నిజమైతే.. ఆ జాబితాను తాను కూడా విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేశారు.
"మోదీ కేబినెట్ మంత్రులు సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆర్ఎస్ఎస్ నేతలు, పాత్రికేయుల ఫోన్లను ఇజ్రాయెల్ సంస్థ పెగాసుస్ ట్యాప్ చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్, లండన్ గార్డియన్ వార్తా సంస్థలు కథనాన్ని ప్రచురించనునట్లు వదంతులు వస్తున్నాయి. ఇది నిజమైతే.. ఆ జాబితాను విడుదల చేస్తాను."
- రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి