కరోనా 2.0 ఉద్ధృతి నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు ప్రాణవాయువు సరఫరా చేస్తున్న రైల్వేశాఖ అరుదైన మైలురాయిని చేరుకుంది. సోమవారం ఉదయం నాటికి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల ద్వారా 10వేల టన్నుల మెడికల్ ఆక్సిజన్ను సరఫరా చేసినట్టు రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ తెలిపారు.
దేశంలో ప్రాణవాయువు కొరత తీర్చేందుకు రైల్వేల ద్వారా.. 'ఆక్సిజన్ ఎక్స్ప్రెస్' పేరిట గత ఏప్రిల్ 19 నుంచి ఈ సేవలను ప్రారంభించింది రైల్వే. ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో సేవలందిస్తోంది.