ఆన్లైన్ రుణాల కుంభకోణానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. బెంగళూరు కేంద్రంగా కిండల్ టెక్నాలజీస్ అనే సంస్థ 100మంది ఉద్యోగులతో ఈ మోసానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ సంస్థను నిర్వహిస్తున్న ప్రేమలత, భవన్ను సీబీసీఐడీ బృందం అరెస్టు చేసింది. ఈ కుంభకోణానికి సూత్రధారులైన చైనీయులు జియోవా యమావ్, వు యువాన్లుమ్ను కూడా అదుపులోకి తీసుకుంది.
ఆన్లైన్ రుణాల స్కామ్లో షాకింగ్ నిజాలు
ఆన్లైన్లో ఇన్స్టంట్ లోన్ యాప్ల కుంభకోణానికి సంబంధించి పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. కిండల్ టెక్నాలజీస్ సంస్థ 100 మంది ఉద్యోగులతో బెంగళూరు కేంద్రంగా రుణ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆన్లైన్ రుణ యాప్ల నిర్వహణ కోసం 600 సిమ్కార్డులను వినియోగించినట్లు పేర్కొన్నారు. సంస్థ నిర్వాహకులు ప్రేమలత, భవన్ సహా కుంభకోణం ముఖ్య సూత్రధారులైన చైనీయులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఆన్లైన్ రుణాల స్కామ్లో షాకింగ్ నిజాలు
ఆన్లైన్ ఇన్స్టంట్ లోన్ యాప్ల కోసం 600 సిమ్ కార్డులను కిండల్ టెక్నాలజీస్ వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంస్థలో మొత్తం 150మంది ఉద్యోగులున్నట్లు పేర్కొన్నారు. ఈ కుంభకోణం మొత్తానికి ప్రధాన సూత్రధారి చైనాకు చెందిన హాంగ్ అని వెల్లడించారు. చైనాలో ఉంటూనే 'డింగ్ డాంగ్' యాప్ను ఉపయోగించిన ఇక్కడి రుణయాప్లను రోజూ పరిశీలిస్తునట్లు చెప్పారు.
ఇదీ చూడండి: అంగన్వాడీ కార్యకర్త గ్యాంగ్ రేప్- అవయవాలు ఛిద్రం