సాధారణ రైల్వే సేవలను తిరిగి ప్రారంభించే విషయంలో స్పష్టమైన తేదీని ఇప్పట్లో చెప్పలేమని రైల్వే శాఖ ప్రకటించింది. ఇందుకోసం రైల్వే సీనియర్ అధికారులు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి దశల వారీగా ఈ సేవలను తిరిగి మొదలుపెడతామని స్పష్టం చేసింది.
కరోనా వ్యాప్తి కారణంగా రైల్వే సేవలను నిలిపి వేయడం వల్ల.. ఈ ఏడాది ఆదాయం బాగా క్షీణించిదని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ప్రయాణికుల ఆదాయంలో 87శాతం వరకు తగ్గుదల నమోదైందని చెప్పారు. అయితే.. ఈ నష్టాన్ని సరకు రవాణాతో అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు యాదవ్. అందులో భాగంగా ఇప్పటికే 97శాతానికి చేరువయ్యామని.. త్వరలోనే దాన్ని అధిగమిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆదాయంలో 87శాతం తగ్గుదల