Miss Universe 2021: ఇటీవల మిస్ యూనివర్స్-2021 కిరీటాన్ని దక్కించుకున్న హర్నాజ్ సంధు బుధవారం ముంబయి చేరుకుంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయం వద్ద హర్మాజ్కు ఘన స్వాగతం పలికారు అభిమానులు. బదులుగా జాతీయ జెండా ఊపుతూ అభివాదం చేసింది సంధు.
ముంబయికి చేరుకున్న 'విశ్వసుందరి' హర్నాజ్ సంధు
Miss Universe 2021: మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న హర్నాజ్ సంధు భారత్కు చేరుకుంది. బుధవారం ముంబయి విమానాశ్రయంలో అడుగుపెట్టిన సంధుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ముంబయికి చేరుకున్న 'విశ్వసుందరి' హర్నాజ్ సంధు
ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల నుంచి ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కినెట్టి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది 21 ఏళ్ల హర్నాజ్ సంధు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్కు ఈ టైటిల్ దక్కింది. భారత్ తరపున మిస్యూనివర్స్ కిరీటం దక్కించుకున్న మూడో వ్యక్తిగా నిలిచింది సంధు. అంతకుముందు 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా ఈ ఘనతను పొందారు.
ఇదీ చూడండి :సీన్ రివర్స్- వరుడి ఇంటికి గుర్రంపై వెళ్లిన పెళ్లికూతురు
Last Updated : Dec 16, 2021, 10:52 AM IST