సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న గాజీపుర్ సరిహద్దును సందర్శించారు మహాత్మ గాంధీ మనవరాలు తార గాంధీ. శాంతియుతంగా నిరసనలు జరపాలని రైతులకు సూచించిన తారా.. అన్నదాతలను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతు ఇవ్వనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ తెలిపింది.
"ఎలాంటి రాజకీయ కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు(గాజీపుర్ సరిహద్దు)రాలేదు. మనం బతకడానికి ఆహారాన్ని అందించే రైతుల కోసమే వచ్చాను. మీ (రైతులు) వల్ల అందరం బతుకుతున్నాం. రైతుల ప్రయోజనంలో మన దేశానికి, మనందరికీ ప్రయోజనం ఉంది. ఏది జరిగినా రైతులు దాని ద్వారా ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను."