Maha Governor Koshyari: మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం ఊహించని సంఘటనలు జరిగాయి. బడ్జెట్ సెషన్కు ముందు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ.. మధ్యలోనే ముగించారు. చట్టసభ్యుల నినాదాల నడుమ ఆయన విధాన్ భవన్ సెంట్రల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఇదీ జరిగింది..
గవర్నర్ సెంట్రల్ హాల్లోకి రాగానే.. మహా వికాస్ అఘాడీ చట్టసభ్యులు కోశ్యారీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో విపక్ష భాజపా.. అధికార పక్షంపై విమర్శలకు దిగింది. దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో.. ఇటీవల అరెస్టైన ఎన్సీపీ నేత, రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది.
దీంతో ఇరువర్గాల వాగ్వాదం నడుమ.. గవర్నర్ వెళ్లిపోయారని చెప్పారు మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్. జాతీయ గీతం కోసం వేచిచూడకుండా వెళ్లారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని తెలుస్తోంది.
అదే కారణం!