తూర్పు లద్ధాఖ్లో భారత్-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సైన్యాధినేత ఎంఎం నరవాణే. వారసత్వ అంశాలు, దేశాల మధ్య నెలకొన్న విభేదాలు, వివాదాలను చర్చలతోనే పరిష్కరించుకోవాలి కానీ.. ఏకపక్ష నిర్ణయాలతో కాదని స్పష్టం చేశారు. ఇరు దేశాల సమ్మతితోనే విభేదాలను పరిష్కరించవచ్చునన్నారు. బలగాల ఉపసంహరణపై చైనా సానుకూలంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
ఇటీవల జరిగిన 11వ భారత్-చైనా సైనిక చర్చలను ప్రస్తావించారు జైశంకర్. మిగతా సరిహద్దుల్లోనూ వివాదాలు సైతం త్వరలో పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.