తెలంగాణ

telangana

By

Published : May 31, 2021, 9:33 AM IST

Updated : May 31, 2021, 9:53 AM IST

ETV Bharat / bharat

coronavirus india: దేశంలో కొత్తగా 1.52లక్షల మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు(coronavirus india) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,52,734 మందికి కొవిడ్ సోకింది. వైరస్​ బారిన పడి మరో 3,128 మంది మరణించారు.

covid cases
కరోనా కేసులు

దేశంలో కొవిడ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా నాలుగోరోజూ 2 లక్షల దిగువన కరోనా కేసులు(coronavirus india) నమోదయ్యాయి. కొత్తగా 1,52,734 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,128 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,38,022 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 91.60 శాతంగా ఉంది.

  • మొత్తం కేసులు:2,80,47,534
  • మొత్తం మరణాలు:3,29,100
  • కోలుకున్నవారు:2,56,92,342
  • యాక్టివ్ కేసులు:20,26,092

ఇదీ చదవండి:'టీకాతో ఏడాది పాటు రక్షణ'

34.48 కోట్ల పరీక్షలు..

దేశంలో ఇప్పటి వరకు 34,48,66,883 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ఆదివారం ఒక్కరోజే 16,83,135 శాంపిల్స్​ను పరీక్షించినట్లు తెలిపింది.

ఇదీ చదవండి:Covid vaccine: బూస్టర్ డోసు అవసరమా?

వ్యాక్సినేషన్​​..

ఒక్కరోజే 10,18,076 వ్యాక్సిన్​ డోసులు(corona vaccination) అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ తెలిపింది. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 21,31,54,129కి చేరినట్లు చెప్పింది.

ఇదీ చదవండి:దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలివే..

Last Updated : May 31, 2021, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details