దేశంలో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో వైరస్ వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని, కొవిడ్-19 ప్రోటోకాల్ అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు.
హోంశాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాలను పటిష్ఠంగా అమలు చేయాలన్న ఆయన... స్థానిక నిబంధనల్లో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్దేశించారు. ఇప్పటికే గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాత్రివేళ కర్య్ఫూ అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఆరోగ్య నిపుణులను సంప్రదించి, విస్తృతంగా చర్చించిన తర్వాత తీసుకురానున్న నూతన మార్గదర్శకాలు డిసెంబరు 1 నుంచి 31 అమల్లోకి వస్తాయని తెలిపారు భల్లా.