తెలంగాణ

telangana

By

Published : May 20, 2021, 2:39 PM IST

ETV Bharat / bharat

నవోదయ విద్యార్థుల కోసం ప్రధానికి సోనియా లేఖ

తల్లితండ్రులను కోల్పోయిన నవోదయ విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలని ప్రధానమంత్రిని కోరారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఈ మేరకు లేఖ రాశారు.

Congress interim chief Sonia Gandhi wrote to PM Modi
నవోదయా విద్యార్థుల కోసం ప్రధానికి సోనియా లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. తల్లితండ్రులు, సంరక్షకులను కోల్పోయిన నవోదయ విద్యాలయ విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

కరోనా కారణంగా అనేక కుటుంబాలు ఎంతో వేదనను అనుభవిస్తున్నాయని సోనియా పేర్కొన్నారు. తల్లితండ్రులను కోల్పోయిన విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి సహకారం లభించడం లేదని అన్నారు.

సోనియా లేఖ

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details