వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్.. ఇటీవల వరుస పరాభవాలతో చతికిలపడింది. దానికి తోడు నాయకత్వ లేమి, అసమ్మతి గళాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేరళ, తమిళనాడు, అసోం, బంగాల్, పుదుచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి కీలకంగా మారాయి. ఈ సారి ఎలాగైనా.. మిత్ర పక్షాల అండతో ఆయా ప్రాంతాల్లో విజయం సాధించి తిరిగి అధికారాన్ని చేపట్టాలని భావిస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అసోం సహా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే.. ఆ పార్టీ ఇంకా మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు అంశాన్ని తేల్చుకోవాల్సి ఉంది.
- తమిళనాడులో తన ప్రధాన భాగస్వామి అయిన డీఎంకేతో సీట్ల పంపకం పనుల్లో కాంగ్రెస్ నిమగ్నమైంది.
- ప్రతి ఐదేళ్లకు అధికారాన్ని మార్చేసే కేరళలో ఈ సారి తాము తప్పక గెలుస్తామన్న ఆశాభావంతో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.
- అసోంలో భాజపాను అధికారం నుంచి విముక్తి చేసేందుకు ఏఐయూడీఎఫ్ మిత్రపక్షంతో కాంగ్రెస్ చేతులు కలిపింది. గత ఏడాది నవంబర్లో కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ వంటి ఆకర్షణీయమమైన నేత ప్రస్తుతం ఆ పార్టీకీ లేనప్పటికీ.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు శక్తిమేర ప్రయత్నాలు చేస్తోంది.
- బంగాల్లో ఇండియా సెక్యులర్ ఫ్రంట్తో కాంగ్రెస్ సహా వామపక్షాలు అధికారిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. భాజపా వ్యతిరేక పోరులో ఏఐఎంఐఎం, టీఎంసీలతో విసుగు చెందిన మైనారిటీ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్కు ఈ పొత్తు ఉపకరిస్తుంది.
పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మాత్రమే కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్లో మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో సత్తా చాటి దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను సుస్థిరం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
లెక్క తేలినప్పుడే..